News April 30, 2024
ఖమ్మం: నేటితో ముగియనున్న ఎర్లీ బర్డ్

నగర, పురపాలక సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏటా ఏప్రిల్లో ఎర్లీ బర్డ్ స్కీంను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా రాయితీతో ఆస్తి పన్ను చెల్లించేందుకు ఎర్లీ బర్డ్ స్కీం ప్రవేశపెట్టారు. ఈ నెలలో పన్ను చెల్లించే వారికి ఈస్కీం ద్వారా 5శాతం రాయితీ లభిస్తుంది. రాయితీతో పన్ను చెల్లించే గడువు మంగళవారం ముగియనుంది. దీంతో వీలైనంత మేరకు పన్నులు వసూలు చేసేలా మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Similar News
News March 28, 2026
వైరా: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ సునీల్ దత్

వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం RTC బస్సు,కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాద స్థలాన్ని ఖమ్మం సీపీ సునీల్ దత్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రయాణికులకు జరిగిన గాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రహదారి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైరా ACP సారంగపాణి, CI వెంకటప్రసాద్, SI పవన్ పాల్గొన్నారు.
News March 28, 2026
ఖమ్మం: ఈ ఒక్క రోజే అవకాశం!

ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న అన్నీ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ కేసులను ఇరువర్గాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగే శ్రమను, ఖర్చులు తగ్గించుకోవాలని కోరారు.
News March 27, 2026
ఖమ్మం జిల్లాలో పలువురు తహశీల్దార్ల బదిలీ

జిల్లాలో పాలనా యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కలెక్టర్ అనుదీప్ పలువురు MROలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ నిర్వహణే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు. దీనిలో భాగంగా ఖమ్మం అర్బన్ MROగా జయచందర్ డిప్యుటేషన్పై నియమితులయ్యారు. అలాగే కల్లూరుకు బ్రహ్మేశ్వరరావు, ఖమ్మం రూరల్కు వినయేందర్ రెడ్డి, నేలకొండపల్లికి రామ్ ప్రసాద్, సింగరేణికి వెంకటేశ్వర్లును బదిలీ చేశారు.


