News April 30, 2024

నంద్యాలలో ఉత్కంఠ పోరు!

image

AP: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది. వైసీపీ యువ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, టీడీపీ నుంచి సీనియర్ మైనార్టీ నేత ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రజాక్షేత్రంలో ఢీకొంటున్నారు. గతంలో ఇక్కడ మూడు సార్లు గెలిచిన ఫరూక్ మంత్రిగాను చేశారు. ఇద్దరు నేతలు తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులు, పథకాలను ప్రస్తావిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముస్లిం ఓట్లు ఇక్కడ కీలకంగా మారనున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News February 3, 2026

బద్వేల్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

image

బద్వేల్ రైస్ మిల్లుల్లో సోమవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేశారు. రైస్ మిల్లుల్లోని నిల్వలను, రికార్డులను పరిశీలించారు. మార్కెట్ సెస్ చెల్లించని సరుకును గుర్తించారు. వాటి విలువను లెక్కించారు. మిల్లుల యజమానుల నుంచి రూ.10,69,528లు వ్యవసాయ మార్కెట్ సెస్సు వసూలు చేశారు. జేడీఎం రామాంజనేయులు ఆదేశాల మేరకు జిల్లా అంతటా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

News February 3, 2026

రేపు ఢిల్లీలో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

image

ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు ఉదయం ఢిల్లీలో NDA కీలక సమావేశం జరపనుంది. ఈ భేటీలో బడ్జెట్ విశేషాలు, వికసిత్ భారత్@2047 విజన్, పార్లమెంటరీ అజెండాలపై చర్చించనున్నారు. FM నిర్మల బడ్జెట్ అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనుండగా, మోదీ MPలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేయనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన సహా కూటమి పార్టీల ఎంపీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

News February 3, 2026

తెలుగువారి 52 ఏళ్ల ట్రైన్.. అరుదైన అవార్డు

image

హైదరాబాద్-విశాఖ మధ్య 52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2025కు గాను బెస్ట్ మెయింటేన్డ్ ట్రైన్ అవార్డు లభించింది. ‘1974 నుంచి ఇదొక ట్రైన్ కంటే ఓ గొప్ప ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకుంది. ట్రైన్ నంబర్ 12728 సెలబ్రేషన్స్ గొప్పగా నిర్వహించాం’ అని SCR ట్వీట్ చేసింది. ఈ రైలుతో మీకున్న అనుబంధంపై కామెంట్ చేయండి.