News February 11, 2026
నెల్లూరు: ఇద్దరే విద్యార్థులు ఉన్నారని..!

నెల్లూరు జిల్లా వరికుంటపాడు(M) నల్లబోతులవారిపల్లి ప్రాథమిక పాఠశాల మంగళవారం మూతపడింది. ఇక్కడ ఇద్దరే చదువుతుండగా ఓ టీచర్ పనిచేస్తున్నారు. కాంచెరువు స్కూల్ టీచర్ సెలవు పెట్టడంతో నల్లబోతులవారిపల్లి టీచర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఆయన అక్కడికి వెళ్లారు. ఇక్కడ ఇద్దరే విద్యార్థులు ఉండటంతో.. ఏ స్కూల్లో టీచర్లు లేకపోయినా నల్లబోతువారిపల్లె టీచర్ను తరచూ పంపిస్తూ ఇక్కడి వారిని పట్టించుకోవడం లేదు.
Similar News
News February 18, 2026
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్గా రవి జోసెఫ్

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్గా రవి జోసెఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఒంగోలు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. నూతన రిజిస్ట్రార్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
News February 18, 2026
నెల్లూరు జిల్లా లాడ్జీల్లో తనిఖీలు

ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి లాడ్జీలు, హోటల్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. రాత్రి వేళల్లో లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నించారు. వారి వివరాలను ఆరా తీశారు.
News February 18, 2026
నెల్లూరు జిల్లా లాడ్జీల్లో తనిఖీలు

ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి లాడ్జీలు, హోటల్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. రాత్రి వేళల్లో లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నించారు. వారి వివరాలను ఆరా తీశారు.


