News February 11, 2026

NLR: నూతన విధానంలో ఇన్విజిలేటర్ల నియామకం

image

పది పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకం పద్ధతి మారనుంది. రాష్ట్ర విద్యాశాఖ అధికారులే బాధ్యతలు నిర్వహించనున్నారు. టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం(టిస్)లో నమోదైన వివరాల ప్రకారం విధులు కేటాయించనున్నారు. ఇక కారణాలు చెప్పి విధులకు తప్పించుకునే వీలుండదు. 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న టీచర్లు ఈ రూల్ మినహాయింపు. జిల్లాలో 174 పరీక్ష కేంద్రాలు ఉండగా.. 27,931 మంది పరీక్షలు రాయనున్నారు.

Similar News

News February 22, 2026

కావలి: దైవ దర్శనాకి వెళ్లి ఒకరి మృతి

image

దైవ దర్శనానికి వెళ్తూ ఒకరు మృతి చెందిన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. కావలికి చెందిన పురుషోత్తం(60) ఆత్రేయపురం మండలం వాడపల్లి ఏడువారాల వేంకన్నను దర్శించుకోవాలని రాజమండ్రికి వెళ్లారు. అక్కడ నుంచి ఆటోలో ఆలయానికి బయలుదేరగా RTC బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని నలుగురికి గాయాలయ్యాయి. పురుషోత్తం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆత్రేయపురం SI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 22, 2026

నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

image

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.

News February 22, 2026

నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

image

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.