News February 11, 2026
మేడ్చల్: ఎంసీపల్లిలో ఓటేసిన 102 ఏళ్ల ఎల్లమ్మ

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 102 ఏళ్లున్న దాసరి ఎల్లమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు ఎందుకు వేయాలని భావిస్తున్న ఎందరికో ఈ బామ్మ ఆదర్శంగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని ఎల్లమ్మ చెబుతున్నారు.
Similar News
News April 18, 2026
సికింద్రాబాద్ రక్షక శక్తికి 200 ఏళ్ల వైభవం

HYD సంస్థానంలో 1813లో కలరా మహమ్మారి విజృంభించిన సమయంలో అప్పయ్య చేసిన పవిత్ర మొక్కు నుంచి నేటి లష్కర్ బోనాల వైభవం వరకు ఉజ్జయిని మహంకాళి దేవాలయం అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. 1815లో కొయ్య విగ్రహంతో ప్రారంభమైన ఈ చారిత్రక క్షేత్రం, నగర ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సాంస్కృతిక గౌరవాన్ని కాపాడుతూ కోట్లాది మంది భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. అమ్మవారి దయుంటే అన్నీ జరిగుతాయని భక్తుల విశ్వాసం.
News April 18, 2026
HYD: పోలీసులకు లొంగిపోయిన మాజీ MLA కొడుకు

హిట్& రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందింది. ఆమె తీవ్రంగా గాయపడింది. హిట్& రన్ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహెల్ పరారీలో ఉండగా, కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.
News April 18, 2026
HYD: పాలిసెట్ దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్..!

పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ దరఖాస్తు గడువు ఈనెల 20వ తేదీతో ముగియనుంది. రూ.100 లేట్ ఫీజుతో 21వ తేదీ వరకు, రూ.300 ఫైన్తో 22 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.చంద్రశేఖర్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. వెబ్సైట్ polycet.sbtet.telangana.gov.in


