News April 30, 2024

అనకాపల్లి: రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

అనకాపల్లి పట్టణం విజయరామరాజు పేట అండర్ పాస్ వంతెన సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే ఎస్సై కె.శాంతారావు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయసు 40-45 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. లేత నారింజరంగు చొక్కా, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. సమాచారం తెలిస్తే 7673906010 నంబర్‌కి సంప్రదించాలన్నారు.

Similar News

News March 18, 2026

విశాఖ: గంజాయి పట్టివేత.. కానిస్టేబుళ్ల అరెస్ట్

image

గంజాయి తరలిస్తున్న ఐదుగురిని విశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వీరిలో VZM జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఉండడం గమనార్హం. కారులో 10 కేజీల గంజాయి తరలిస్తుండగా భీమిలి పరిధి దాకమర్రికి సమీపంలో వీరిని అరెస్ట్ చేశామన్నారు. కానిస్టేబుళ్లు శివప్రసాద్(ఎస్. కోట), వి.రాంబాబు (వేపాడ), ఇ.సతీశ్(కొత్తవలస) స్టేషన్లకు చెందిన వారిగా మిగిలిన వారిని పి.శివకృష్ట, జి.గోపిగా గుర్తించారు.

News March 18, 2026

విశాఖ: ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ

image

జీవీఎంసీకి బకాయి ఉన్న ఆస్తి పన్ను పూర్తిగా చెల్లిస్తే వడ్డీ‌పై 50% రాయితీ పొందవచ్చు అని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. నగరవ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు అవుతున్నప్పటికీ స్థానికేతర గృహ బకాయిలు ఉండిపోతున్నాయని పేర్కొన్నారు. వీటిని వసూలు చేసేందుకు జీవీఎంసీ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించిందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.

News March 18, 2026

విశాఖ: ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ

image

జీవీఎంసీకి బకాయి ఉన్న ఆస్తి పన్ను పూర్తిగా చెల్లిస్తే వడ్డీ‌పై 50% రాయితీ పొందవచ్చు అని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. నగరవ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు అవుతున్నప్పటికీ స్థానికేతర గృహ బకాయిలు ఉండిపోతున్నాయని పేర్కొన్నారు. వీటిని వసూలు చేసేందుకు జీవీఎంసీ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించిందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.