News February 11, 2026
Peoples Pulse.. ఉమ్మడి మెదక్ ఎగ్జిట్ పోల్స్ ఇవే!

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు సంబంధించి 403 వార్డుల్లో జరిగిన ఎలక్షన్స్పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 166-174 వార్డులు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BRS 172-180, BJP 35-42, MIM 2-4, ఇతరులు 8- 12 వార్డులు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.
Similar News
News February 20, 2026
TN CM స్టాలిన్తో పన్నీరు సెల్వం భేటీ

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. మాజీ CM, AIADMK బహిష్కృత నేత పన్నీరు సెల్వం CM స్టాలిన్ను కలిశారు. ఐదేళ్ల DMK పాలనను కొనియాడారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో DMK మరోసారి విజయం సాధిస్తుందన్నారు. CMను కలిసి ఐదేళ్ల పాలన బాగుందని చెప్పి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ భేటీతో పన్నీరుసెల్వం వర్గం DMKతో ఎన్నికలకు వెళ్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
News February 20, 2026
TGకి రూ.387 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు

తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం కింద రావలసిన నిధుల్లో ₹387 CRను కేంద్రం ఇవాళ విడుదల చేసింది. వీటిని గ్రామాల్లో మౌలికసదుపాయాల కల్పన, పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వినియోగించాలని ఆదేశించింది. కాగా పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రం విడతల వారీగా ఈ నిధులను రాష్ట్రానికి అందిస్తోంది. ఇప్పటివరకు ₹1034.42 CR వచ్చాయి. ఇంకా ₹2000 CR రావాల్సి ఉంది. వీటిని వెంటనే అందించాలని మంత్రి సీతక్క కోరారు.
News February 20, 2026
తెలంగాణ జాతిపిత కేసీఆరే: దాస్యం

తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేశారని, తెలంగాణ సాధన కోసం గాంధీ మార్గంలో పోరాడారని చెప్పారు. సాధించిన తెలంగాణను అంబేడ్కర్ స్ఫూర్తితో దేశానికి ఆదర్శంగా నిలిపారని, 500కు పైగా సంక్షేమం పథకాలను అమలు చేశారని తెలిపారు. 10 ఏండ్ల బీఆర్ఎస్, కేసీఆర్ పాలనలో సంక్షేమం అభివృద్ధి ప్రజలకు చేరువైందన్నారు.


