News February 11, 2026
EXIT POLLS.. ఉమ్మడి నిజామాబాద్లో ఇలా..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 5 నుంచి 7 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 1 నుంచి 2 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.
Similar News
News February 14, 2026
స్టే.ఘ: పదిలో ఒక్కడు!

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీకి ఈనెల 11న ఎన్నికలు జరగగా, శుక్రవారం ఓట్ల లెక్కింపు పక్రియ ముగిసింది. కాగా, మున్సిపల్ కేంద్రంలోని 10 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేయగా.. మొదటి వార్డు అభ్యర్థి తాటికొండ మధు విజయం సాధించి, పదిమందిలో ఒకడిగా నిలిచాడు.
News February 14, 2026
జ్యోతికతో పెళ్లికి నిరాకరించిన సూర్య తండ్రి.. ఆ ఒక్క మాటతో!

ప్రేమికుల దినోత్సవం వేళ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక లవ్ స్టోరీ వైరలవుతోంది. వీరి పెళ్లికి తొలుత సూర్య తండ్రి శివకుమార్ అంగీకరించలేదట. ‘పెళ్లి చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటా. లేదంటే ఒంటరిగా ఉంటా’ అని సూర్య కరాఖండిగా చెప్పడంతో తన మనసు మార్చుకున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1999లో మొదలైన వీరి ప్రేమ 2006లో పెద్దల ఆశీస్సులతో పెళ్లిగా మారింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు.
News February 14, 2026
మెదక్: మున్సిపాలిటీలకు ప్రిసైడింగ్ అధికారుల నియామకం

మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ రాహుల్ రాజ్ నలుగురు ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. మెదక్ మున్సిపాలిటీకి ఎల్లయ్య(ZP CEO), రామాయంపేటకు జయచంద్రారెడ్డి(RDO తూప్రాన్), నర్సాపూర్కు రమాదేవి(RDO మెదక్), తూప్రాన్కు మహిపాల్(RDO నర్సాపూర్) అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.


