News February 11, 2026
EXIT POLLS.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలా..!

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 13 నుంచి 15 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 3 నుంచి 5 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP 1 నుంచి 2 మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.
Similar News
News February 15, 2026
ములుగు: సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు

మునిసిపాలిటీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రేపు (సోమవారం) జరగనున్న ప్రజావాణి( గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జరిగే మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియలో జిల్లా అధికారులు పాల్గొననున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టర్ సూచించారు.
News February 15, 2026
మాస శివరాత్రి, మహా శివరాత్రి.. తేడాలేంటి?

ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్దశి నాడు వచ్చేది మాస శివరాత్రి. మాఘ మాసంలో వచ్చేది మహా శివరాత్రి. ఏడాదికి 12 మాస శివరాత్రులు వస్తాయి. మహా శివరాత్రి ఒక్కసారే వస్తుంది. మాస శివరాత్రి మనశ్శాంతి, పాపక్షయం కోసం జరుపుకొంటారు. శివుడు లింగోద్భవమైన, శివపార్వతుల కళ్యాణం జరిగిన మహా శివరాత్రిని అత్యంత విశేషంగా జరుపుకొంటారు. రెండింటిలోనూ ఉపవాసం, జాగారం, అభిషేకాలు ప్రధానమే. అయితే మహా శివరాత్రి అత్యున్నతమైనది.
News February 15, 2026
బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

జాతర బందోబస్తు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బి.గితే సూచించారు. వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా బందోబస్తును ఆయన ఆదివారం పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులు పోలీసుల సమన్వయంతో వ్యవహరించాలని, క్యూలైన్ల నియంత్రణలో సహకరించాలని కోరారు.


