News April 30, 2024

శ్రీకాకుళం: ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ 459 మంది అరెస్టు

image

నగదు, మద్యం, గంజాయి వంటి అక్రమ రవాణా కేసులలో ఇప్పటివరకు 459 మందిని అరెస్టు చేయగా 716 కేసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు.. ఇందులో భాగంగా 36 మోటార్ సైకిళ్లు, 13 కార్లు, ఒక వ్యాను, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.87 లక్షలుగా ఉంది. అలాగే సరైన పత్రాలు లేని కారణంగా 13 మొబైల్ ఫోన్లు, 10 చేతి గడియారాలు, 14 చీరలు, పదివేల టీ షర్టులు, 2500 కరపత్రాలు సీజ్ చేశారు.

Similar News

News March 12, 2026

శ్రీకాకుళం: 24 మంది గ్రేడ్-2 వీఆర్వోలకు గ్రేడ్-1 పదోన్నతి

image

శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న 24 మంది గ్రేడ్ వీఆర్వోలకు గ్రేడ్ వన్ వీఆర్వోలుగా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి స్థానాలను కేటాయించారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యకు పరిష్కార మార్గం చూపిన కలెక్టర్‌కు, జాయింట్ కలెక్టర్‌లకు వీఆర్వోల సంఘ ప్రతినిధులు రాజేష్, అప్పలనాయుడు, రాంజీ ఇతర ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.

News March 12, 2026

శ్రీకాకుళం: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

image

జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గురువారం తెలిపారు. ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించి జిల్లాలో 11,602 కేసులు గుర్తించడమైనదని, జిల్లా మొత్తం మీద 20 బెంచ్‌లు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలో 4 బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

News March 12, 2026

శ్రీకాకుళం: ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్

image

శ్రీకాకుళం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం స్క్వాడ్ పరిశీలనలో కాపీయింగ్ చేస్తున్న ఆరుగురిని డిబార్ చేసినట్లు డీఈవో ఎ.రవి బాబు చెప్పారు. 866 మంది విద్యార్థులకు 755 మంది హాజరు కాగా 111 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణను సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షిస్తున్నాయననారు.