News February 12, 2026

పార్వతీపురం: ‘జిల్లా వ్యవసాయ రూపురేఖలు మార్చేయడమే లక్ష్యం’

image

వ్యవసాయ రంగంలో రూపురేఖలు మార్చేయడమే డిస్ట్రిక్ట్ అగ్రి-రూరల్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్లాన్ లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. DARTP మన జిల్లాలో ఇప్పుడే ప్రారంభమైందన్నారు. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 24 జిల్లాలు అభ్యర్థనలు సమర్పించగా, ఏపీ నుంచి కేవలం 7 జిల్లాలు మాత్రమే ఎంపిక చేయబడ్డాయని, ఇందులో భాగంగా ఈ జిల్లా ఎంపికైందని గుర్తు చేశారు.

Similar News

News February 17, 2026

పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్

image

డిజిటల్ ఇండియాను ప్రమోట్ చేసేందుకు కేంద్రం నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్‌లో యూపీఐకి ఆప్షన్ లేకపోవడం చర్చనీయాంశమైంది. అక్కడి ఫుడ్ స్టాల్స్‌.. ‘నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్’ అంటున్నాయి. UPI ఉంటుందిలే అనే ధీమాతో అక్కడికి వచ్చిన వారు చెల్లింపులకు ఇబ్బంది పడ్డారు. ఒకపక్క నో క్యాష్.. నో కార్డ్.. ఓన్లీ యూపీఐ అని ప్రమోట్ చేస్తుంటే ఇక్కడ సీన్ రివర్స్‌లో ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

News February 17, 2026

మద్దిమడుగు పర్యటనలో సీఎంవో సెక్రెటరీ.. కలెక్టర్ స్వాగతం

image

మద్దిమడుగు క్షేత్రంలో సంతు సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారవుతున్న తరుణంలో సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాస్ రాజ్ మంగళవారం సందర్శించారు. జిల్లా కలెక్టర్ సంతోష్ ఆయనకు స్వాగతం పలికి ఏర్పాట్లను వివరించారు. CM రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకుని భద్రత, ప్రోటోకాల్ అంశాలను సెక్రెటరీ పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News February 17, 2026

కృష్ణా: ఈ దృశ్యం..ఏం చెబుతోంది?

image

కృష్ణా జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మచిలీపట్నం-విజయవాడ 216 జాతీయ రహదారిపై గూడూరు సెంటర్ వద్ద ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గూడూరు పోలీసులు మంగళవారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టాన్ని అర్థమయ్యే విధంగా, యాక్సిడెంట్‌లో నుజ్జునుజ్జు అయిన వాహనాన్ని ఆ మార్గంలో ఉంచి వారికి అవగాహన కల్పిస్తున్నారు.