News February 12, 2026

నంద్యాల: ఎదురు చూపులు!

image

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు గడిచినా కొత్త పింఛన్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా వితంతువులతో పాటు వృద్ధాప్య, కళాకారులు, ఇతర పింఛన్లకు అర్హత కలిగిన సుమారు 6 వేలకు మందిపైగా ఉన్నారు. వారంతా నూతన పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నూతన పింఛన్ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని అర్హత కలిగిన లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Similar News

News April 20, 2026

JRG: బెట్టింగ్ ముఠాలో పట్టుబడింది వీరే..!

image

జంగారెడ్డిగూడెం పోలీసులు <<19692230>>బెట్టింగ్ ముఠా<<>>ను అరెస్ట్ చేశారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన పుల్లూరి నాగ వెంకట నరసింహాచార్యులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతని విచారణ ఆధారంగా హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలో పోలీసు అధికారులు దాడులు నిర్వహించి మల్లెల వీరాంజనేయులు, పర్వతనేని వేణు, గజ్జల రవీంద్ర రెడ్డి, పల్లెపాగ రవి, తులబంతుల తాండవ కృష్ణలను అదుపులోకి తీసుకున్నారు.

News April 20, 2026

GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్‌క్వార్టర్స్

image

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా

News April 20, 2026

మెదక్: ఎర్రవల్లి నుంచి జగిత్యాలకు KCR

image

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేడు సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో జగిత్యాలకు బయలుదేరనున్నారు. జగిత్యాల కలెక్టరేట్ వద్ద హెలిప్యాడ్‌లో దిగిన అనంతరం నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరి ప్రజాసభలో పాల్గొననున్నారు.