News February 12, 2026
బడ్జెట్ సమావేశాలు.. వ్యూహాలపై వైసీపీ చర్చ

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ వైసీపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనుంది. మ.3 గంటలకు తాడేపల్లిలో పార్టీ చీఫ్ జగన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. నిన్న అసెంబ్లీకి వెళ్లిన జగన్ అన్ని రోజులూ హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News April 18, 2026
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఇవాళ వర్ష సూచన ఉంది. ఏపీలోని విశాఖ, మన్యం, అల్లూరి, పోలవరం, ప.గో, ఏలూరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో వానలు పడొచ్చని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు ఏపీలోని 27 మండలాల్లో, TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచనున్నాయి.
News April 18, 2026
కాళ్ల బేరానికొచ్చిన ట్రంప్?

ఇరాన్ను నాశనం చేసి హార్ముజ్ను స్వాధీనం చేసుకుంటామని ఇన్నాళ్లూ పెద్దపెద్ద ప్రకటనలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై ప్రేమను ఒలకబోస్తున్నారు. హార్ముజ్ను ఓపెన్ చేశామని ప్రకటించడంతో ఏకంగా థాంక్స్ చెప్పారు. ఇరాన్ అందమైన దేశమంటూ కీర్తించారు. యుద్ధంలో గెలవడం చేతగాకే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని పలువురు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇరాన్ యురేనియం ఇచ్చేస్తుందన్న ట్రంప్ <<19679151>>ప్రకటనా<<>> ఉత్తదే అని తేలింది.
News April 18, 2026
అందుకే మ్యాచ్లకు రావట్లేదన్న డింపుల్ బ్యూటీ

PBKS యజమాని ప్రీతి జింటా గత సీజన్ వరకూ స్టేడియానికి వచ్చి తన జట్టుకు సపోర్ట్ చేసేవారు. అయితే ఈ సీజన్లో జట్టు విజయాలతో దూసుకెళ్తున్నా ఆమె స్టేడియంలో కనిపించకపోవడంతో SM వేదికగా ఫ్యాన్స్ ప్రశ్నించారు. దీంతో ఆమె రిప్లై ఇచ్చారు. ‘చాలా కాలంగా పిల్లలకు దూరంగా ఉన్నా. ప్రస్తుతం వాళ్లకు సెలవులు. వారితో గడపడానికే మ్యాచ్లకు రావట్లేదు. త్వరలోనే స్టేడియంలో కనిపిస్తా’ అని చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


