News February 12, 2026
HYD: ఆస్తిని లాక్కొని.. తండ్రిని గెంటేసిన కూతుర్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని కుమార్తెలే వీధిన పడేసిన అమానవీయ ఘటన మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్లో కలకలం రేపింది. మిథాని రిటైర్డ్ ఉద్యోగి రాజలింగం తనకున్న 130 గజాల స్థలాన్ని ఇద్దరు కుమార్తెల పేరిట రాసిచ్చారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే వారు ఆయన్ని ఇంటి నుంచి గెంటివేశారు. తిండి పెట్టకుండా బయటకు పంపడంతో బాధితుడు కుమార్తెల ఇంటి ముందే ఆందోళనకు దిగారు. ప్రస్తుతం బస్తీవాసులే ఆయనకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్నారు.
Similar News
News February 18, 2026
జూపార్క్: ఇండియాలోనే కాస్ట్ లీ టికెట్ ధర!

జూ పార్కులో సాధారణ ఎంట్రీ ఫీజు కేవలం రూ.100 (పెద్దలకు) మాత్రమే ఉంది. కానీ, <<19174320>>ఈ అండర్<<>> వాటర్ టన్నెల్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న పని. గుజరాత్ సైన్స్ సిటీలోని ఇలాంటి టన్నెల్ అక్వేరియం టికెట్ ధర ప్రస్తుతం రూ.200 పైన ఉంది. హైదరాబాద్లో దీనిని మరింత అత్యాధునికంగా నిర్మిస్తున్నందున నిర్వహణ ఖర్చుల దృష్ట్యా టికెట్ ధర రూ. 300 నుంచి రూ.500 వరకు ఉండే అవకాశం ఉందని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి.
News February 18, 2026
గోల్కొండ గెస్ట్ హౌస్లో సామాన్యుడికి ‘నో ఎంట్రీ’

సర్కారు వారి ‘వారసత్వ’ వ్యాపారం ముదిరి పాకాన పడింది. చారిత్రక గోల్కొండ గెస్ట్ హౌస్ను సామాన్యులకు దూరం చేస్తూ కేవలం బడా బాబులకే పరిమితం చేసేలా పర్యాటక శాఖ పావులు కదుపుతోంది. ‘బ్యూటిక్ హోటల్స్’ పేరుతో ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్న ఈ ఆస్తులు ఇకపై “ఇన్విటేషన్ ఓన్లీ” క్లబ్బులుగా మారబోతున్నాయి. గండిపేట రిసార్టుల్లో రూమ్ కావాలంటే పైస్థాయి రికమండేషన్ ఉండాల్సిందే అన్నట్లుగా నిబంధనలు మారుస్తున్నారు.
News February 18, 2026
HYD: షాద్నగర్ యాక్సిడెంట్లో చనిపోయింది వీరే..!

షాద్నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద <<19172186>>అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. కాగా, అరుణాచలం నుంచి HYD తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఇన్నోవా క్రిస్టాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుర్కయంజాల్కు చెందిన పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు.


