News February 12, 2026

పెద్దపల్లి జిల్లాలో ఓవరాల్ పోలింగ్ శాతం ఎంతంటే…

image

జిల్లాలోని నాలుగు పురపాలికలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓవరాల్‌గా 75.28 శాతం పోలింగ్ నమోదయింది. రామగుండం కార్పొరేషన్‌లో 69.32%, పెద్దపల్లి పురపాలక సంఘం 73.54%, సుల్తానాబాద్ పురపాలక సంఘంలో 81.53%, మంథని పురపాలక సంఘం పరిధిలో 76.76% ఓటింగ్ నమోదయింది. కాగా రేపు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Similar News

News February 21, 2026

మామిడి: ఈ దశలో కాయ తొలిచే పురుగు ముప్పు మొదలు

image

మామిడి కాయలు నిమ్మ సైజు కంటే పెద్దవయ్యే దశ నుంచి కాయ తొలిచే పురుగులు కాయల తొడిమలు, రెండు కాయలు కలసి ఉన్నచోట గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన పురుగులు కాయలను తొలిచి తింటూ అవి పగిలి, రాలి పోవడానికి కారణమవుతాయి. ఈ పురుగులను గుర్తిస్తే లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్(50 ఇ.సి) 1ml మరియు వేప మందు (10,000 ppm) 2ML కలిపి పిచికారీ చేయాలి. పండుఈగ కట్టడికి ఎకరాకు 8-10 మిథైల్ యూజీనాల్ ట్రాప్స్ అమర్చాలి.

News February 21, 2026

తిరుమలలో నిత్యం కల్యాణమే..

image

తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి అర్చకులు రోజూ అత్యంత వైభవంగా వివాహం జరుపుతారు. భక్తుల దాంపత్య సౌఖ్యం కోసం ఈ సేవ నిర్వహిస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరుపుతారు. ఈ కళ్యాణమహోత్సవం చూడడానికి భక్తులకు కన్నుల పండువగా ఉంటుంది. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు స్వామివారి ఆశీస్సులతో పాటు వస్త్ర బహుమానం, ప్రసాదం లభిస్తాయి.

News February 21, 2026

సంగారెడ్డి: అధికారులు సమన్వయంతో కృషి చేయాలని: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ పీ.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్‌లో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంపొందించాలన్నారు.