News February 12, 2026

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 78.25 శాతం పోలింగ్!

image

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ పోలింగ్ 78.25% నమోదైంది. 12 మున్సిపాలిటీల్లో 3,35,244 మందికి 2,62,337 మంది ఓటేశారు. MHBDలో 65712 మందికి 49681, BHPL-52726కు 34421, జనగామ-44045కి 34821, NSPT-40968కి 34908, పరకాల-26784కి 21469, తొర్రూరు-21451కి 16730, స్టే.ఘ-18550కి 15670, కేసముద్రం-15963కి 13750, ములుగు-13963కి 11227, మరిపెడ-13687కి 11683, డోర్నకల్-10869కి 8900, వర్ధన్నపేట-10525కి 9077 మంది ఓటేశారు.

Similar News

News April 17, 2026

భీమవరం: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

image

భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. మొత్తం 15 అర్జీలు అందాయని, అందులో ప్రధానంగా వైద్య సహాయం, ఉపాధి, రూ.15 వేల పెన్షన్ మంజూరు వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

News April 17, 2026

ఖమ్మం: బియ్యం అక్రమ రవాణాదారుపై పీడీ యాక్ట్‌

image

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆత్మకూరి జగదీష్‌పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు సీపీ సునీల్ దత్ శుక్రవారం తెలిపారు. నిందితుడిపై ఖమ్మంలో 13 కేసులతో పాటు ఇతర జిల్లాల్లోనూ కేసులు ఉన్నాయని, అతడిని చంచలగూడ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

News April 17, 2026

TU: వార్షికోత్సవ పనులను వేగవంతం చేయాలి: వీసీ

image

ఈనెల 22న నిర్వహించనున్న యూనివర్సిటీ వార్షికోత్సవం పనులను వేగవంతం చేయాలని టీయూ వీసీ ప్రొ.టి. యాదగిరి రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వార్షికోత్సవ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కమిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపల్ ఆరతి, రాంబాబు పాల్గొన్నారు.