News February 12, 2026
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 78.25 శాతం పోలింగ్!

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ పోలింగ్ 78.25% నమోదైంది. 12 మున్సిపాలిటీల్లో 3,35,244 మందికి 2,62,337 మంది ఓటేశారు. MHBDలో 65712 మందికి 49681, BHPL-52726కు 34421, జనగామ-44045కి 34821, NSPT-40968కి 34908, పరకాల-26784కి 21469, తొర్రూరు-21451కి 16730, స్టే.ఘ-18550కి 15670, కేసముద్రం-15963కి 13750, ములుగు-13963కి 11227, మరిపెడ-13687కి 11683, డోర్నకల్-10869కి 8900, వర్ధన్నపేట-10525కి 9077 మంది ఓటేశారు.
Similar News
News February 18, 2026
ఈశాన్య మూలలో వాస్తు దోషం ఉంటే?

ఈశాన్యం లోపిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘జ్ఞాన సముపార్జనలో ఆటంకాలు ఏర్పడతాయి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలాంటి స్థలంలో ఉంటే సమాజానికి, బంధువులకు దూరంగా ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. లభించాల్సిన అవకాశాలు చేజారిపోతాయి. ఈశాన్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. నిపుణుల సలహాతో సరైన మార్పులు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 18, 2026
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

నందిపేట్ మండల కేంద్రంలో నిర్మిస్తోన్న భవిత సెంటర్ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు.
News February 18, 2026
రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆదిలాబాద్ చిన్నారుల ప్రభంజనం

రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఆటల పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకోవడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ పోటీల కోసం జిల్లా నుంచి 26 మంది విద్యార్థులు హైదరాబాద్కు వెళ్లగా, వారు పాల్గొన్న దాదాపు అన్ని విభాగాల్లోనూ సత్తా చాటారు. వారిని కలెక్టర్ అభినందించారు.


