News February 12, 2026
NLR: దొంగతనం నింద వేశారని విద్యార్థి సూసైడ్

నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. టీపీగూడూరు(M) మండలం పేడూరు గమ్మళ్లపాలేనికి చెందిన యువకుడు(16) ఓ ప్రైవేట్ స్కూళ్లో 10వ తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఉరేసుకున్నాడు. అతను చదివే స్కూల్లో నగదు దొంగతనం జరిగిందని.. విద్యార్థే చోరీ చేశాడని టీచర్లు నిలదీశారంట. నింద భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థి బంధువులు ఆరోపిస్తున్నారు.
Similar News
News April 17, 2026
నెల్లూరులో అమ్మాయిల పేరుతో మోసం

నెల్లూరు నగరంలోని ఓ యువకుడికి ఫేస్బుక్లో ఓ అమ్మాయి పేరుతో ఉన్న ఫేక్ ఐడి నుంచి మెసేజ్తోపాటు, కాల్ చేయగా అవతలి వ్యక్తి ఏడుస్తూ అత్యవసరంగా డబ్బులు కావాలని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలాంటి భావోద్వేగపూరితమైన మాటలతో మాయ చేస్తూ నగదు కాజేసే సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. మీకు తెలిసిన వారు ఎవరైనా SM వేదికగా డబ్బులు అడిగితే పంపకుండా పోలీసులకు ఫిర్యాదు చేయండి.
News April 17, 2026
నెల్లూరులో స్పెషల్ ఆఫీసర్లు కనబడటం లేదు..!

సర్పంచుల పాలన ముగిసింది. వీరి స్థానంలో 376 మంది ప్రత్యేకాధికారులు కొలువుదీరారు. ఇది జరిగి నేటికి 15 రోజులు పూర్తయినా ప్రత్యేకాధికారులు ఎవరో తెలియని పరిస్థితుల్లో గ్రామస్థులు గందరగోలానికి గురవుతున్నారు. ఒక్కో అధికారికి 1 నుంచి రెండు పంచాయతీలు కేటాయించారు. చెక్ పవర్ కలిగిన వీరు గ్రామాల్లో కనిపించకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదు. కొన్నిచోట్ల అధికారులు అందుబాటులో ఉండక పోవడంతో పల్లె పాలన పడకేస్తోంది.
News April 17, 2026
నెల్లూరులో స్పెషల్ ఆఫీసర్లు కనబడటం లేదు..!

సర్పంచుల పాలన ముగిసింది. వీరి స్థానంలో 376 మంది ప్రత్యేకాధికారులు కొలువుదీరారు. ఇది జరిగి నేటికి 15 రోజులు పూర్తయినా ప్రత్యేకాధికారులు ఎవరో తెలియని పరిస్థితుల్లో గ్రామస్థులు గందరగోలానికి గురవుతున్నారు. ఒక్కో అధికారికి 1 నుంచి రెండు పంచాయతీలు కేటాయించారు. చెక్ పవర్ కలిగిన వీరు గ్రామాల్లో కనిపించకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదు. కొన్నిచోట్ల అధికారులు అందుబాటులో ఉండక పోవడంతో పల్లె పాలన పడకేస్తోంది.


