News February 12, 2026

రాజమండ్రి వ్యక్తి హత్య?.. సహజీవనం చేస్తున్న మహిళే చంపిందా?

image

రాజమండ్రికి చెందిన నాగశివ(38) విశాఖ జిల్లా ఆనందపురం శివారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన <<19110749>>సంగతి తెలిసిందే<<>>. మృతుడి ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. నాగశివతో సహజీవనం చేస్తున్న శ్రావణి, మద్యం మత్తులో జరిగిన గొడవ కారణంగానే అతనిపై దాడి చేసి చంపి ఉండవచ్చని సమాచారం. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Similar News

News April 20, 2026

పరమాత్ముడు ఒక్కటే.. మతాలన్నీ ప్రజల కల్పనలే!

image

మర్మమెరుగ లేక మతములు కల్పించి
యుర్విజనులు దుఃఖ మొందుచుంద్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: పరమాత్ముడి అసలు రహస్యం తెలియక మూఢ జనాలు విభిన్న మతాలను కల్పించారు. ఒకరినొకరు ద్వేషించుకుంటూ బాధపడుతూ కాలం గడుపుతున్నారు. అద్దాల గదిలో ఉన్న కుక్క తన ప్రతిబింబాన్ని చూస్తే కలవరపడి మొరుగుతుందో అలా చేస్తున్నారు.
<<-se>>#PADHYAM<<>>

News April 20, 2026

డిగ్రీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫ్రీ హాస్టల్, కోచింగ్

image

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ BC గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 అకడమిక్ ఇయర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 కాలేజీల్లో BSc, BCom, BBA లాంటి రెగ్యులర్ కోర్సులతో పాటు యానిమేషన్ వంటి స్పెషల్ కోర్సుల్లో 9,260 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు మే 10వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఉచిత వసతితోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్, పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు.

News April 20, 2026

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ పరీక్షలు.. 7757 విద్యార్థులు

image

జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ 10 ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు. పదో తరగతికి 10 పరీక్ష కేంద్రాల్లో 2,692, ఇంటర్మీడియట్‌కు 18 కేంద్రాల్లో 5,065, మొత్తం 7,757 మంచి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.