News February 12, 2026

₹10లక్షలు చెల్లించాలి; ధోనీకి HC ఆదేశం.. కారణమిదే!

image

MS ధోనీ గతంలో వేసిన పరువు నష్టం దావా కేసును విచారించేందుకు వీడియోలను డాక్యుమెంట్లుగా మార్చేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.10లక్షలు చెల్లించాలని మద్రాస్ కోర్టు ఆదేశించింది. 2013 IPL ఫిక్సింగ్‌లో ధోనీ హస్తం ఉందని Ex IPS జి.సంపత్ కుమార్, మరికొందరు ఆరోపణలు చేశారు. దీంతో ₹100 కోట్లకు ధోనీ పరువునష్టం దావా వేశారు. 2025 ఆగస్టులో కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు ఇచ్చింది.

Similar News

News April 17, 2026

పొట్ట ఉన్నవాడే గొప్ప.. వింత ఆచారం గురించి తెలుసా?

image

ఇథియోపియా అడవుల్లోని బోడి తెగ ఆచారం వింతగానూ, ఆసక్తికరంగానూ ఉంటుంది. ఇక్కడ పొట్ట ఎక్కువగా ఉన్న పురుషులకే ఫుల్ డిమాండ్. ఏటా జరిగే ‘కయోల్’ ఉత్సవం కోసం యువకులు శ్రమించకుండా ఆవు పాలు, రక్తం తాగి పొట్టను పెంచుకుంటారు. ఎవరి పొట్ట పెద్దగా ఉంటే వారే అందగాళ్లు. యువతులు కూడా భారీ పొట్ట ఉన్నవారినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(49/100)

News April 17, 2026

హార్ముజ్‌ను ఓపెన్ చేసినందుకు థాంక్స్: ట్రంప్

image

హార్ముజ్‌ ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఆ దేశానికి థాంక్స్ చెప్పారు. జలసంధిని ‘స్ట్రెయిట్ ఆఫ్ ఇరాన్’ (ఇరాన్ జలసంధి)గా ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఇన్నాళ్లూ హార్ముజ్‌ను తెరవమని ట్రంప్ ఒత్తిడి చేసినా తలొగ్గని ఇరాన్ లెబనాన్-ఇజ్రాయెల్ సీజ్‌ఫైర్‌తో వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపైనా ఆశలు చిగురించాయి.

News April 17, 2026

BIG ALERT: రేపు మండే ఎండలు.. పిడుగులతో వర్షాలు

image

AP: వచ్చే రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత, పిడుగులతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. రేపు 27 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, ప.గోదావరి, ఏలూరు జిల్లాల్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.