News February 12, 2026

పార్లమెంట్‌లో ఏపీ అభివృద్ధిపై ‘సానా, ఉదయ్’ ప్రశ్నలు

image

కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ పార్లమెంట్ వేదికగా ఏపీ అభివృద్ధి కోసం పోటీపడుతున్నారు. వీరిద్దరూ కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ సమస్యలపై నిత్యం గళమెత్తుతూ, వివిధ ప్రశ్నల సందిస్తున్నారు. అభివృద్ధి విషయంలో వీరిద్దరిదే పైచేయిగా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఉభయ సభల్లోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వీరు సాగిస్తున్న పోరాటం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Similar News

News April 19, 2026

అనంత: పెరుగుతున్న చీనీ ధరలు.. రైతుల హర్షం

image

అనంతపురం మార్కెట్ యార్డులో చీనీకాయల ధరలు కొన్ని రోజులుగా పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో శుక్రవారం 1,135 టన్నుల చీనీకాయలను టన్ను గరిష్ఠ ధర రూ.28 వేలకు రైతులు విక్రయించారు. మధ్యస్థం రూ.18 వేలు, కనిష్ఠం రూ.10 వేలు చొప్పున అమ్మారు. శనివారం రూ.29 వేలకు విక్రయాలు జరిగాయని యార్డు ఎంపికశ్రేణి ఇన్‌ఛార్జ్ కార్యదర్శి, ఏడీఎం రాఘవేంద్రకుమార్ తెలిపారు.

News April 19, 2026

అనకాపల్లి: చందనోత్సవానికి ప్రత్యేక బస్సులు

image

సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అనకాపల్లి జిల్లా ప్రజా రవాణా అధికారిణి(ఆర్టీసీ) వి. ప్రవీణ తెలిపారు. డిపో నుంచి ఈనెల 20న తెల్లవారుజామున మూడు గంటల నుంచి 15 బస్సులు నడుపుతామన్నారు. ఈ బస్సులు రాత్రి వరకు తిరుగుతాయన్నారు.

News April 19, 2026

అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి?

image

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.