News February 12, 2026
ASF: మున్సిపల్ ‘కౌన్సిలర్ల’ క్యాంపు రాజకీయం!

ASF మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్, BRS మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో హ్యాంగ్ ఫలితాల భయంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. ఛైర్మన్ అభ్యర్థి రాపర్తి రవి, చిలువేరు వెంకన్న మినహా మిగిలిన 18 మంది అభ్యర్థులను బెంగళూరు క్యాంపునకు తరలించినట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీ ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండటంతోనే ర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Similar News
News February 13, 2026
బర్డ్ ఫ్లూ భయం.. పడిపోయిన చికెన్ ధరలు

AP: ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో <<19090331>>బర్డ్ ఫ్లూ బయటపడటంతో<<>> చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 10 రోజుల కిందటి వరకు కేజీ చికెన్ రూ.300పైనే ఉండగా ప్రస్తుతం రూ.160-180కి తగ్గింది. కాగా బర్డ్ఫ్లూ ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేదని అధికారులు చెబుతున్నారు. చికెన్, కోడి గుడ్లను 100 డిగ్రీలపైన వేడితో ఉడికించి తింటే ప్రమాదం లేదంటున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 13, 2026
RGM: వన్ CI, గన్ మెన్ పై చర్యలు తీసుకోవాలని వినతి

ఈనెల 10న గోదావరిఖనికి చెందిన మార్కాపురి తిలక్ న్యాయవాదిపై వన్ టౌన్ CI ఇంద్రసేనారెడ్డి అనుచిత ప్రవర్తన, దాడి చేసిన గన్ మెన్ పై చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను బార్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయంలో CIపై చర్యలు తీసుకోవాలని CPని కోరారు. చర్యలు తీసుకునే వరకు విధులకు హాజరుకామని లాయర్లు పిలుపునిచ్చారు.
News February 13, 2026
సిద్దిపేట: మూడు మున్సిపాలిటీల్లో ‘గులాబీ’ జెండా రెపరెపలు

సిద్దిపేట జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన కంచుకోటలను నిలబెట్టుకుంది. గజ్వేల్, చేర్యాల, దుబ్బాకలో స్పష్టమైన మెజారిటీ సాధించి పీఠాలను కైవసం చేసుకుంది. గజ్వేల్లో 11, చేర్యాలలో 7 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. హుస్నాబాద్లో మాత్రం కాంగ్రెస్ 16 సీట్లతో విజయదుందుభి మోగించింది. మారిన రాజకీయ సమీకరణాల్లోనూ బీఆర్ఎస్ 3 చోట్ల మ్యాజిక్ ఫిగర్ రావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.


