News February 12, 2026

మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: కలెక్టర్

image

పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. గురువారం రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్ వైజర్లతో నిర్వహించిన శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి రౌండ్ ఫలితాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల మేరకు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చూడాలని సూచించారు.

Similar News

News February 28, 2026

INDvsWI.. పిచ్ రిపోర్ట్ ఇదే

image

T20WC S-8లో రేపు కోల్‌కతాలో 7PMకి IND, WI తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టే సెమీస్ చేరనున్న నేపథ్యంలో మ్యాచుపై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను బాలెన్స్‌డ్‌గా తయారు చేసినట్లు క్యురేటర్ తెలిపారు. ‘ఈ పిచ్‌పై 200+ స్కోర్ నమోదవుతుంది. 200+ ఛేజ్ చేయవచ్చు. ఏ జట్టు అయితే తమ స్కిల్స్‌ను బాగా ఉపయోగిస్తుందో అదే గెలుస్తుంది. డ్యూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని వివరించారు.

News February 28, 2026

గల్ఫ్ దేశాలకు మద్దతు ప్రకటించిన పాక్

image

ఇరాన్, గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులను పాకిస్థాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ఖండించారు. యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు తమ మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు. అబుదాబిలో జరిగిన దాడుల్లో పాకిస్థాన్ పౌరుడొకరు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారని, ఇరాన్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది.

News February 28, 2026

ఏలూరు: ‘సెకండ్ ఇంటర్ పరీక్షకు 5,791 మంది హాజరు’

image

ఏలూరు జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ సెంకడ్ ఇయర్బో టనీ పరీక్షకు మొత్తం 6,828 మంది విద్యార్థులకు గానూ 5,791 మంది హాజరయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. 55 సెంటర్లో జరిగిన ఈ పరీక్షలకు వివిధ కారణాల చేత 237 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 3,916 మంది, ఒకేషనల్ విభాగంలో 1,875 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు ఆయన వివరించారు.