News April 30, 2024

తూ.గో: సోకులేరు వాగులో పడి డ్రైవర్ మృతి

image

రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు మండలం తులసిపాక సమీపంలో ఓ వ్యక్తి మంగళవారం సోకులేరు వాగులో పడి మృతి చెందాడు. మృతుడు నందిగామకు చెందిన కొండయ్య(40)గా గుర్తించారు. మోతుగూడెం SI గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రి నుంచి లారీని నడుపుతూ నందిగామ వస్తున్న కొండయ్య మార్గ మధ్యలో స్నానం చేసేందుకు వాగులోకి దిగాడు. కాలు జారి ఊబిలో పడి ప్రాణాలు విడిచాడన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News April 4, 2026

పులిని బంధించేందుకు నెలకోట చేరిన మహారాష్ట్ర బృందం

image

పోలవరం(D) నేలకోట కొండ వద్ద మకాం వేసిన పులిని బంధించేందుకు మహారాష్ట్ర నుంచి 12 మంది సభ్యుల బృందాన్ని శుక్రవారం ఏలూరు, రంపచోడవరం, రాజమహేంద్రవరం అటవీశాఖ అధికారులతో కలిసి నేలకోట, గండికోట మధ్యలో బృందం మాటువేసింది. పెదకొండేపూడిలో గోశాల వద్ద మరో బృందాన్ని ఉంచారు. ఈ రాత్రికి పులిని బంధించడం లేదా రిజర్వు ఫారెస్టు వైపు పులిని దారి మళ్లించేలా ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారి తెలిపారు.

News April 4, 2026

తూ.గో: రైతులకు మంత్రి మనోహర్ భరోసా..!

image

కాపవరం గ్రామంలోని హైవే పక్కన ఉన్న ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శుక్రవారం కాపవరం హైవేలో వెళ్తున్న ఆయన రైతులను చూసి ఆగారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ధరలు వచ్చేలా చూస్తామన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. జనసేన మండలాధ్యక్షుడు సుంకర సత్తిబాబు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు.

News April 4, 2026

తూ.గో: రైతులకు మంత్రి మనోహర్ భరోసా..!

image

కాపవరం గ్రామంలోని హైవే పక్కన ఉన్న ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శుక్రవారం కాపవరం హైవేలో వెళ్తున్న ఆయన రైతులను చూసి ఆగారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ధరలు వచ్చేలా చూస్తామన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. జనసేన మండలాధ్యక్షుడు సుంకర సత్తిబాబు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు.