News February 12, 2026
ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: కలెక్టర్

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజల సానుకూల దృక్పథం పెరగాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రజల సానుకూల దృక్పథం (పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్)పై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలోఅమలు పక్కాగా ఉండాలని, అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
Similar News
News February 15, 2026
ఉండవల్లిలో సీఎం పర్యటన.. పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

సోమవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి ఉండవల్లి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని చెప్పారు.
News February 15, 2026
గుంటూరు జిల్లాలో శివరాత్రికి పటిష్ఠ భద్రత

మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు శివాలయాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. వడ్లమూడి, పెదకాకాని, పేరేచర్ల, తెనాలి, తాడేపల్లి ఆలయాల వద్ద ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
News February 15, 2026
మంగళగిరిలో జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్ కళ్యాణ్

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. 150 మందితో పార్టీని ప్రారంభించి నేడు 12.98 లక్షల సభ్యత్వాలు సాధించామని పవన్ తెలిపారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, కార్యదర్శి హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.


