News February 12, 2026
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: ఎస్పీ శబరీష్

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ శబరీష్ తెలిపారు. మహబూబాబాద్, డోర్నకల్, కేసముద్రం, తొర్రూరు, మరిపెడ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, ఎవరూ గుమిగూడకూడదని హెచ్చరించారు.
Similar News
News February 23, 2026
చిన్నవయసులోనే వృద్ధాప్యమా?

వయసుతోపాటు వృద్ధాప్యం రావడం సహజమే కానీ చిన్నవయసులోనే ఈ లక్షణాలు కనిపించడం ఈ మధ్య ఎక్కువవుతోంది. దీనికి జెనెటిక్స్తో పాటు మరిన్ని కారణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఒత్తిడి, నిద్ర, ఆహారం, లైఫ్స్టైల్, అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం దీనికి కారణాలు. పోషకాహారం, తగినంత నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు ఫేస్వాష్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్, విటమిన్ C, నియాసినమైడ్ సీరమ్ వాడాలని సూచిస్తున్నారు.
News February 23, 2026
పల్నాడులో ఇంటర్ పరీక్షలకు కౌంట్డౌన్..!

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నీలావతి దేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతి లేదని పేర్కొన్నారు.
News February 23, 2026
చేవెళ్ల: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..!

చేవెళ్లలో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. 2018లో ప్రేమవివాహం చేసుకున్న రాజేశ్వరి, కృష్ణ చంద్రారెడ్డినగర్లో ఉంటున్నారు. 6 నెలల క్రితం భార్యకు ఇన్స్టాగ్రాంలో శరత్తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నిద్రలో ఉన్న భర్తను ప్రియుడితో కలిసి రాజేశ్వరి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.


