News February 12, 2026
GNT: చంద్రబాబును కలిసిన బండ్ల గణేశ్

సీఎం చంద్రబాబును సినీ నిర్మాత బండ్ల గణేశ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి క్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం తిరుమలకు పాదయాత్రగా వెళ్లి మొక్కు తీర్చుకున్నట్లు తెలిపారు. పాదయాత్ర అనుభవాలను సీఎం అడిగి తెలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాన్ని ఆయన సీఎంకి అందించారు. .
Similar News
News April 18, 2026
చిన్నారి పునర్విక చికిత్సపై TDP స్పష్టత

అరుదైన SMA టైప్-1 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్సకు మంత్రి నారా లోకేశ్ రూ.6 కోట్లు స్వయంగా అందించిన విషయంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టీడీపీ Xలో ట్వీట్ చేసింది. మొత్తం రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం దాతలు రూ.10 కోట్లు సమకూర్చగా, మిగతా మొత్తాన్ని లోకేశ్ భరించారని రాసుకొచ్చింది. CMRF నిధులు ఉపయోగించలేదని స్పష్టం చేస్తూ తప్పుడు ప్రచారాన్ని Xలో ఖండించింది.
News April 18, 2026
GNT: ఎండలు బాబోయ్.. ఉక్కబోతతో జనం ఉక్కిరి బిక్కిరి

గుంటూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకీ సూర్యప్రతాపం పెరిగిపోతూ రికార్డు స్ధాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. శనివారం 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల ధాటికి ప్రజలు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయటకు రావడానికే భయపడి పోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రాత్రి వేళల్లోనూ కొనసాగుతున్నాయి.
News April 18, 2026
GNT: CRDA గ్రీవెన్స్ డే మార్పు

రాజధాని అమరావతి రైతులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడి APCRDA కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డే ఇకపై ప్రతి సోమవారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కమిషనర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరిస్తారు. గతంలో శనివారం నిర్వహించగా మార్పు చేశారు. రాయపూడి CRDAలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్ వద్ద రోజువారీగా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.


