News April 30, 2024
బాల రాముడి వెండి ప్రతిమను పీఎంకు బహుకరించిన ఎంపి

అల్లాదుర్గం వద్ద జరిగిన విశాల్ జనసభ కార్యక్రమం వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జహీరాబాద్ ఎంపీ, బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఘనంగా స్వాగతించి ఆయన ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా బాల శ్రీరాముడి వెండి ప్రతిమను ప్రధానమంత్రి మోడీకి బీబీ పాటిల్ బహూకరించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఎంపీకి, పీఎం సూచించినట్లు పార్టీ వర్గీయులు తెలిపారు.
Similar News
News March 3, 2026
మెదక్: సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.
News March 3, 2026
మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే ఈ రంగుల పండుగ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రకృతి సిద్ధమైన రంగులను మాత్రమే వినియోగిస్తూ, సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ హితవు పలికారు. ఆనందోత్సాహాల మధ్య పండుగను ఆస్వాదించాలని ఆమె కోరారు.
News March 2, 2026
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్లాన్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ‘బాల్య వివాహ ముక్త భారత్’ ప్రచార గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమాజంలో ఈ దురాచారంపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు


