News February 12, 2026

కౌంటింగ్‌ వేళ అప్రమత్తంగా ఉండాలి: సీపీ గౌష్‌ ఆలం

image

కరీంనగర్‌ జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌ యంత్రాంగం సిద్ధమైంది. నగరంలోని అస్త్ర కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్‌లో పోలీసు అధికారులకు, సిబ్బందికి సీపీ గౌష్‌ ఆలం దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకుండా నిఘా ఉంచాలన్నారు.

Similar News

News April 16, 2026

కరీంనగర్ : అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్‌కు ఘన వీడ్కోలు

image

కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ బదిలీపై సిద్దిపేటకు వెళుతున్న సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. లక్ష్మీ కిరణ్ ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకుని రెవెన్యూ సమస్యల పరిష్కారంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. వరి కొనుగోలు నిర్వహణలో జిల్లాను ఆదర్శంగా నిలిపారని తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆమెను సన్మానించారు.

News April 15, 2026

KNR: ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఏఈ

image

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్‌గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.

News April 15, 2026

KNR: ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఏఈ

image

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్‌గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.