News February 12, 2026
మేడారం హుండీ ఆదాయం రూ.13,51,76,275

మేడారం వన దేవతల జాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం హుండీలను తెరిచి 8 రోజుల పాటు లెక్కించగా రూ.13,51,76,275 ఆదాయం సమకూరినట్లు ఎండోమెంట్ ఉప కమిషనర్ రామల సునీత తెలిపారు. సమ్మక్క ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 309, సారలమ్మ ప్రాంగణంలో 309, గోవిందరాజు వద్ద 81, పగిడిద్దరాజు వద్ద 81 హుండీలను పూర్తిగా లెక్కించారు.
Similar News
News April 13, 2026
పసిబిడ్డకు పన్నెండు గంటల నిద్ర ఉండాల్సిందే..

ఏడాదిలోపు పసిపిల్లలకు రోజుకి 12-16 గంటలు నిద్ర అవసరం. రెండేళ్ల లోపువారైతే 8-14 గంటలు నిద్ర ఉండాలంటున్నారు నిపుణులు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎదగాలన్నా, శారీరక ఎదుగుదల బావుండాలన్నా పసిపిల్లలు రోజులో సగభాగం నిద్రలో ఉంటేనే మంచిది. సరిపోయినంతగా నిద్ర ఉంటే, ఎదిగిన తర్వాత వారిలో ఆలోచనాశక్తి, సమస్యను పరిష్కరించే నైపుణ్యం, జ్ఞాపకశక్తితోపాటు మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని పొందుతారని చెబుతున్నారు.
News April 13, 2026
జగిత్యాల: చివరి రోజు 99.93% హాజరు

జగిత్యాల జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. నేడు జరిగిన చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్షకు 68 కేంద్రాల్లో 12,694 మందికి గాను 12,685 మంది హాజరై 99.93% హాజరు నమోదైంది. 9 మంది గైర్హాజరయ్యారు. సప్లమెంటరీలో 2 మందిలో 1 విద్యార్థి హాజరై 50% నమోదైంది. అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాము తెలిపారు.
News April 13, 2026
కనకాంబరంలో పిండి నల్లి కట్టడి ఎలా?

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.


