News February 12, 2026
GNT: 21న జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం

గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు వెల్లడించారు. జడ్పీ ఛైర్పర్సన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, సభ్యులందరూ సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Similar News
News April 16, 2026
పరిశ్రమలను అడ్డుకోవడం సైకోయిజమే: లోకేశ్

దేశ రక్షణకు అధునాతన బూట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి అడ్డుకుంటాం అనడం ముమ్మాటికి సైకోయిజమే అని మంత్రి లోకేశ్ X వేదికగా జగన్పై ఫైర్ అయ్యారు. తల్లిని తరిమేశారు, చెల్లిని గెంటేశారు, దైవం అంటే భక్తి లేదు, దైవం అంటే ద్వేషం. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారు. అమరావతిని మార్చేస్తాం, కట్టినవన్నీ కూల్చేస్తాం కంపెనీలను వెళ్లగొడతాం ఏమిటి దుర్మార్గపు పనులు అని ప్రశ్నించారు.
News April 16, 2026
పెదనందిపాడు: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

పరీక్షల భయంతో పెదనందిపాడు మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చిలకలూరిపేటలో చదువుతున్న ఆమె.. ఫస్ట్ ఇయర్లో 4 సబ్జెక్టులు ఫెయిల్ అయింది. ఈసారి కూడా ఫెయిల్ అవుతాననే భయంతో ఎలుకల మందు తాగింది. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. దీనిపై పెదనందిపాడు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.
News April 16, 2026
సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు వెలగపూడి సచివాలయానికి వెళ్తారు. 11.45 గంటలకు ఆర్ధిక శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం సాయంత్రం 04.00 గంటలకు దేవాదాయ శాఖపై సమీక్షిస్తారు. తిరిగి 05.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.


