News May 1, 2024

ఎన్నికలు శాంతి యుతంగా నిర్వహించాలి: మన్యం ఎస్పీ

image

సాధారణ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం పార్వతీపురంలో మన్యం జిల్లా డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక గ్రామాలు, వ్యక్తులపై నిరంతర నిఘా ఉండాలని, ఎన్నికల నిబంధనలు ప్రకారం పని చేయాలన్నారు. అనంతరం మార్చి నెల సంబంధించిన నేర సమీక్ష చేపట్టారు.

Similar News

News March 18, 2026

VZM: ‘అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దు’

image

జిల్లాలో గృహ అవసర గ్యాస్ సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాథ్ మంగళవారం తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని ఆయన సూచించారు.

News March 18, 2026

VZM: ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రోత్సాహకాలు

image

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ప్రోత్సాహక నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. నేరాల చేధన, ప్రాణరక్షణ, ఆస్తి రికవరీలో విశేష సేవలు అందించిన వారిని అభినందించారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని ప్రోత్సహిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

News March 18, 2026

VZM: ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రోత్సాహకాలు

image

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ప్రోత్సాహక నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. నేరాల చేధన, ప్రాణరక్షణ, ఆస్తి రికవరీలో విశేష సేవలు అందించిన వారిని అభినందించారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని ప్రోత్సహిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.