News February 13, 2026

గచ్చిబౌలిలో నోట్ల కట్టలతో పారిపోయాడు!

image

గచ్చిబౌలిలో పట్టపగలే నగదు చోరీ జరిగింది. గోపన్‌పల్లిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన సీఎంఎస్ వాహన డ్రైవర్ అజిత్ అలియాస్ శివ రూ.57 లక్షల నగదుతో పరారీ అయ్యాడు. కస్టోడియన్లు బ్యాంక్‌లో ఉండగా సెక్యూరిటీ గార్డు బయటకు వెళ్లిన సమయం చూసి చోరీ చేశాడు. వాహనాన్ని తెల్లాపూర్ వద్ద వదిలేసి నగదుతో నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News

News April 20, 2026

HYD: పెట్రోల్ బంకుల్లో ఇవి లేవా? నిలదీయండి

image

HYD పెట్రోల్ బంకుల్లో మనకు ఉచిత మంచినీరుతో పాటు, ఫ్రీగా ఎయిర్, నైట్రోజన్ అందించాలని నిబంధనలు ఉన్నాయి. కంపెనీ టెలిఫోన్ నంబర్లు, టాయిలెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ కోసం తగిన ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని IOCL సహా అన్ని కంపెనీల నిబంధనలలో పొందుపరిచారు. నగరంలో అనేక చోట్ల ఇవి కనిపించవు. IOCL: 1800-2333-555, HPCL: 1800-2333-555, BPCL: 1800-22-4344 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించాయి.

News April 20, 2026

HYD: పిల్లలు కలగటం లేదా? ఇక్కడికి రండి

image

పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగక దిగులు చెందుతున్నారా? ఆ చింతన వదిలేయండి. నమ్మకంతో HYD గాంధీ ఆస్పత్రిలో IVF(సంతాన సాఫల్య కేంద్రానికి) రావాలని డా.ఇందిరా సూచిస్తున్నారు. అద్భుతమైన చికిత్స అందిస్తున్నామని, IVF సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి సుమారుగా 40 శాంపిల్స్ సేకరించి, 17 మందికి IVF వైద్యం ప్రారంభించినట్లుగా ఆమె తెలిపారు. వీరిలో ఏడుగురికి పాజిటివ్ ఫలితం వచ్చిందన్నారు.
#SHARE IT

News April 20, 2026

HYD: ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఇదే!

image

HYDలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు MMTSలో ‘జీరో ఫేర్’ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. టికెట్ ఉచితం చేస్తే ప్రయాణికుల సంఖ్య రోజుకు 1.2 లక్షలకు చేరుతుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం MMTS ద్వారా ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయమే వస్తోంది. ఈ స్వల్ప మొత్తాన్ని ప్రభుత్వమే భరించి, ప్రజలను మళ్లీ రైలు ప్రయాణం వైపు మళ్లించడం ద్వారా రోడ్లపై రద్దీని తగ్గించవచ్చని సర్కార్ భావిస్తోంది.