News February 13, 2026
పుల్లంపేట: హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

పుల్లంపేట మండలంలోని సాంఘిక వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి సమస్యలపై అడిగి తెలుసుకున్నాను. వంటగది, బాత్రూంలో, వాటర్ ప్లాంట్, వాషింగ్ మెషీన్ సదుపాయాలను పరీక్షించి పరిశుభ్రతపై అధికారులకు సూచనలు చేశారు.
Similar News
News February 21, 2026
349 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

UPSC 349 అసిస్టెంట్ కమాండెంట్స్(CAPF ఎగ్జామినేషన్ -2026) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు మార్చి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష, PET, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జులై 19న రాత పరీక్ష నిర్వహిస్తారు. వెబ్సైట్: https://upsconline.nic.in
News February 21, 2026
పత్తి కొనుగోళ్లకు నెలాఖరు వరకు అవకాశం

TG: రాష్ట్రంలోని పత్తి రైతులకు ఊరట లభించింది. ఈ నెలాఖరు వరకు కొనుగోళ్లు చేపట్టనున్నట్లు సీసీఐ తెలిపింది. పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలంటూ ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈక్రమంలోనే కేంద్ర జౌళిశాఖకు అధికారులు లేఖ కూడా రాశారు. దీంతో గడువు పొడిగిస్తున్నట్లు సీసీఐ తెలిపింది.
News February 21, 2026
చిత్తూరు జిల్లా రైతులకు గమనిక

ప్రభుత్వం రైతు విశిష్ట సంఖ్య కోసం నమోదు ప్రక్రియ చేపట్టింది. చిత్తూరు జిల్లాలో 2.55 లక్షల మంది రైతులు ఉండగా 2లక్షల మంది వివరాలే ఇప్పటికీ నమోదయ్యాయి. పీఎం కిసాన్, పంట నష్టం, బీమా, భూసార పరీక్షలు, విత్తనాల పంపిణీకి ఈ సంఖ్య ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ నంబర్ లేకపోతే పథకాలు రావు.


