News February 13, 2026

పిఠాపురం: అనాథలైన చిన్నారులతో మాట్లాడిన కలెక్టర్

image

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉదారతతో ఇద్దరు చిన్నారులకు ఆసరా దొరికింది. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ వద్దకు చేరిన ఇద్దరు చిన్నారులకు అండగా నిలబడేందుకు జిల్లా అధికార యంత్రాంగం మానవత్వంతో ముందడుగు వేసింది. పిల్లలకు గూడు కల్పించేందుకు ఇంటి స్థలాన్ని ఇచ్చేందుకు నడుం బిగించిందని కలెక్టర్ తెలిపారు. మాదాపురానికి చెందిన ఇద్దరు చిన్నారులతో ఇవాళ కలెక్టరేట్లో కలెక్టర్ మాట్లాడారు.

Similar News

News April 16, 2026

భర్త మరణం తట్టుకోలేక.. భార్య కన్నుమూత

image

కృష్ణాజిల్లా గూడూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కప్పలదొడ్డికి చెందిన తిరుమలశెట్టి వీర రాఘవరావు (66) అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య పద్మావతి (61) కొద్దిసేపటికే స్పృహ కోల్పోయారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె కూడా ప్రాణాలు విడిచారు. గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 16, 2026

HYD, RR జిల్లాలో చనిపోయిన వారికి రేషన్ బియ్యం

image

ఉమ్మడి HYD, RR జిల్లాల్లో మరణించిన వ్యక్తుల పేర్లపైనా బియ్యం సరఫరా అవుతుండం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. CAG ఇటీవల హెచ్చరిక జారీ చేస్తూ, పన్నులు చెల్లించే వారు, అధిక భూములు కలిగినవారు లబ్ధి పొందుతున్నారని వెల్లడించింది. చనిపోయిన వారి పేర్ల మీద సైతం రేషన్ బియ్యం పంపిణీ జరుగుతున్నట్లుగా తెల్చింది. అర్హతలేని వారికి రేషన్ అందుతుండటంపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణుల మాట.

News April 16, 2026

ప.గో: సహాయం చేయండి.. బహుమతి పొందండి

image

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే ‘పీఎం-రాహత్’ పథకంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గాయపడిన వారికి రూ. 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని బుధవారం తెలిపారు. బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చే వారికి రూ.25 వేల నగదు పురస్కారం అందజేస్తామన్నారు. విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు.