News February 13, 2026
కర్నూలు విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల పరిహారం

అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన కర్నూలు విద్యార్థిని జాహ్నవి(23) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (సుమారు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన జాహ్నవి 2023 జనవరి 3న రాత్రి రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది.
Similar News
News February 21, 2026
తొలి తెలుగు శిలా శాసనం.. చూశారా?

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కడపలోని(AP) సి.పి. బ్రౌన్ గ్రంథాలయంలో ప్రదర్శించిన తొలి తెలుగు శిలా శాసనం నమూనా స్థూపం ఫొటో నెట్టింట వైరలవుతోంది. క్రీ.శ.575 కాలానికి చెందిన ఈ రేనాటి చోళుల శాసనం.. తెలుగు భాష ప్రాచీనతకు సజీవ సాక్ష్యం. మాతృభాషపై మమకారంతో పలువురు ఈ ఫొటోను షేర్ చేస్తూ మన భాషా వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నారు. మన భాషకు ‘ప్రాచీన హోదా’ రావడంలో ఇటువంటి శాసనాలే కీలక పాత్ర పోషించాయి.
News February 21, 2026
260 పోస్టులు.. అప్లై చేశారా?

<
News February 21, 2026
ఎందుకలా?!: గాలి మనకు కనిపించదు..

ఏదైనా వస్తువు మనకు కనిపిస్తుందంటే దానిపై కాంతి పడి పరావర్తనం(రిఫ్లెక్షన్) చెందిందని అర్థం. అటు ఏ పదార్థం/వస్తువు ఏర్పడాలన్నా అణువుల కలయిక అవసరం. అయితే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వంటి గ్యాసెస్ అణువులున్నా కనిపించకపోవడానికి కారణం వాటి నిర్మాణం. అవి చాలా సూక్ష్మంగా, పారదర్శకంగా ఉంటాయి. దీంతో వాటిపై కాంతి పడినా రిఫ్లెక్ట్ చేయలేవు. ఫలితంగా గాలిని చూడలేం. ప్రతిరోజూ 2pmకు ఇలా ఓ కొత్త విషయం ఎందుకలా?!లో.


