News February 13, 2026

MNCL: మున్సిపల్ ఫలితాలపై కాయ్ రాజా కాయ్..!

image

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై అప్పుడే బెట్టింగ్‌లు మొదలైనట్లు సమాచారం. ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో కీలకమైన డివిజన్లలో గెలుపు, ఓటమి విషయంలో పలువురు జోరుగా పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. చూద్దాం ఎవరు గెలుస్తారో.

Similar News

News April 18, 2026

బిల్లుపై కేంద్రం Vs ప్రతిపక్షాలు.. మీ అభిప్రాయమేంటి?

image

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రజల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహిళలకు మంచి చేయాలనుకున్న కేంద్రం.. పాత రిజర్వేషన్ బిల్లునే పెట్టాల్సిందని, దానికి డీలిమిటేషన్‌ను లింక్ చేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. డీలిమిటేషన్‌ వల్ల అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని, ప్రతిపక్షాలకు మహిళల పట్ల గౌరవం లేకనే ఉమెన్ బిల్లును వ్యతిరేకించాయని మరికొందరు అంటున్నారు. బిల్లుపై మీ ఒపీనియన్?

News April 18, 2026

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలని CM వినతి

image

MHBD బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని CM రేవంత్ రెడ్డి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం, పర్యావరణ హితంగా ఉక్కు ఉత్పత్తి చేసే పరిశ్రమల ఆవశ్యకతను వివరించారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.

News April 18, 2026

స్వచ్ఛతను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత: కలెక్టర్

image

స్వచ్ఛతను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ రాజకుమారి సూచించారు. శనివారం నంద్యాలలోని పొన్నాపురం కాలనీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కాలనీలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని అన్నారు. కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.