News February 13, 2026
శ్రీశైలంలో మల్లన్నకు నేడు పుష్ప పల్లకీ సేవ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన నేడు శ్రీశైలం మల్లన్నకు పుష్ప పల్లకీ సేవ నిర్వహించనున్నారు. ఉదయం నుంచి చండీస్వర పూజ, రుద్ర, చండీ హోమాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. సాయంత్రం ప్రత్యేక పూజలతో పాటు పుష్కరిణి, శివ దీక్ష శిబిరాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులను సౌకర్యం కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Similar News
News February 13, 2026
BREAKING: నర్సాపూర్లో హంగ్

మెదక్ జిల్లా నర్సాపూర్లో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ 6, BRS 5, బీజేపీ 4 వార్డులు గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 8 ఎవరూ సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News February 13, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

కొచ్చిన్ పోర్ట్ అథారిటీ 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/BE (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. ప్రాజెక్ట్ కన్సల్టెంట్కు నెలకు రూ.65వేలు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్కు రూ.55వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.cochinport.gov.in
News February 13, 2026
ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం!

ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం అయ్యింది. మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్ అత్యధికంగా 12 వార్డుల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 5 వార్డుల్లో గెలుపొందగా, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 వార్డుల్లో విజయం సాధించారు. బీజేపీ 1 వార్డులో గెలిచి తన ఉనికిని చాటింది.


