News February 13, 2026
ఘన జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు

☛ దేశీ ఆవుపేడ 100kgలు ☛ దేశీ ఆవు మూత్రం 5లీటర్లు ☛ బెల్లం 2kgలు ☛ పప్పు దినుసుల పిండి 2kgలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) ☛ గుప్పెడు పుట్టమట్టి
తయారీ: ఈ పదార్థాలను 100KGలు బాగా చివికిన పశువుల పేడలో వేసి చేతితో బాగా కలిపి, దానిపై 5 లీటర్ల ఆవుమూత్రాన్నిచల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేసి గోనెపట్టా కప్పాలి. 48 గంటల తర్వాత పలుచగా ఆరబెట్టుకోవాలి. ఇలా 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది.
Similar News
News April 17, 2026
16ఏళ్ల నుంచే రిలేషన్షిప్లో ఉన్నా: నటి

తాను 16ఏళ్ల వయసు నుంచే రిలేషన్షిప్స్లో ఉన్నానని ఆలియా భట్ సోదరి, నటి పూజాభట్ వెల్లడించారు. ఇప్పుడు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని.. విడాకుల తర్వాత స్వేచ్ఛగా బతుకుతున్నానని తెలిపారు. 2003లో మనీశ్ మఖీజాను పెళ్లిచేసుకున్న పూజా భట్ 2014లో డైవర్స్ తీసుకున్నారు. 50+ ఏజ్లో జిమ్కు వెళ్లడం అలవాటైందని, ఇప్పుడు అది తనకు టెంపుల్లాంటిదని అన్నారు. హన్సిక కూడా ఇలాగే <<19671407>>సింగిల్<<>> లైఫ్పై కామెంట్స్ చేశారు.
News April 17, 2026
లోక్సభ నియోజకవర్గంగా అమరావతి!

AP: డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రంలో LS స్థానాలు 38కి చేరుతాయి. దీంతో ప్రస్తుత 25 సీట్లతో పాటు మరో 13 ఏర్పాటవుతాయి. నియోజకవర్గాల పరిధులూ మారుతాయి. రాజధానిగా చట్టబద్ధ హోదా దక్కిన అమరావతి కొత్త నియోజకవర్గంగా అవతరించే అవకాశం ఉంది. గతంలోని తెనాలి, బొబ్బిలి, గుడివాడ, మార్కాపురం వంటి సీట్లు తిరిగి ఏర్పాటు కావచ్చని తెలుస్తోంది. 2011 జణగణన ప్రకారం చేస్తే ఒక్కో స్థానం పరిధిలో 13L జనాభా ఉంటారు.
News April 17, 2026
‘అక్షయ తృతీయ’ ఏ రోజున చేసుకోవాలి?

హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. ఏటా వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథి రోజు దీన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ తిథి ఏప్రిల్ 19న 10.49AMకు మొదలై మరుసటి రోజు 7.27AMకు ముగుస్తుంది. అందువల్ల 19వ తేదీనే పండుగ జరుపుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆ రోజున 10.49AM-12.20PM మధ్య పూజకు మంచి సమయమని పేర్కొంటున్నారు.


