News February 13, 2026

BREAKING.. ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

image

జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం 15 వార్డులు ఉండగా, అన్నింటిలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీలకు ఒక్క వార్డు కూడా దక్కలేదు. ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా, ఈ విజయం జిల్లా రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.

Similar News

News February 16, 2026

ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు: ఆర్ఐవో

image

జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆర్ఐవో రవి వెల్లడించారు. మొత్తం 28,550 మంది విద్యార్థులు (ప్రథమ సంవత్సరం 14,607, ద్వితీయ సంవత్సరం 13,943) 50 కేంద్రాలలో పరీక్షలు రాయనున్నారు. పరీక్షల పర్యవేక్షణకు 700 మంది ఇన్విజిలేటర్లు, 5 సిట్టింగ్ స్క్వాడ్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు.

News February 16, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

image

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి గడువును పెంచారు. ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అర్హులు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in

News February 16, 2026

అన్నమయ్య: ఉత్కంఠ.. కోర్టుకు మాజీ మంత్రి

image

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందుతుడిగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరులు సోమవారం తంబళ్లపల్లె కోర్టులో హాజరు కానున్నారు. వారితో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరి కొంతమంది కూడా కోర్టుకు రానున్నారు. పలు కారణాల రీత్యా ఈనెల 2న మాజీ మంత్రి సోదరులు తంబళ్లపల్లె కోర్టులో వాయిదాకు గైర్హాజరవడంతో వారి తరఫు న్యాయవాదులు ఆబ్సెంట్ పిటిషన్ సమర్పించిన విషయం తెలిసిందే.