News May 1, 2024
అల్లదుర్గ్: మోదీ రాకతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం

భాజపా మెదక్, జహీరాబాద్ లోక్సభ అభ్యర్థులు రఘునందన్ రావు, బీబీ పాటిల్లకు మద్దతుగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని ప్రసంగించారు. అల్లాదుర్గం మండలం చిల్వర గ్రామ శివారులో నిర్వహించిన సభకు అత్యధిక జనాభా రావడంతో బీజేపీ శ్రేణుల్లో, యువతలో జోష్ నింపింది. ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సభ సక్సెస్ అయిందని బీజేపీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు.
Similar News
News March 4, 2026
మెదక్: రేపటి నుంచి జనగణన శిక్షణకు డీఎస్ఓ

మెదక్ జిల్లా సైన్స్ అధికారి(DSO) రాజిరెడ్డి బుధవారం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. రేపటి నుండి హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగే జనగణన శిక్షణకు తాను హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే వేసవిలో చేపట్టనున్న మొదటి దశ ఇళ్ల గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని రాజిరెడ్డి వెల్లడించారు.
News March 4, 2026
జాతీయ క్రికెట్లో కానిస్టేబుల్ సాయి సత్తా.. ఎస్పీ సన్మానం

జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారుడు, కానిస్టేబుల్ సాయి కుమార్ను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఘనంగా సన్మానించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఇటీవల తిరుపతిలో జరిగిన సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్లో సాయి అద్భుత ప్రదర్శనతో జట్టును సెమీ ఫైనల్కు చేర్చారు. క్రీడల్లో రాణిస్తూ పోలీస్ శాఖకు పేరు తెచ్చినందుకు ఎస్పీ ఆయనను అభినందించారు.
News March 4, 2026
మెదక్: ఈ మండలాల్లో రేపు, ఎల్లుండి నీటి సరఫరా బంద్

మెదక్ జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనుల కారణంగా ఈనెల 5, 6న పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని 275 గ్రామాలు, మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లోని 80 ఆవాసాలకు నీటి సరఫరా ఉండదన్నారు. ముందస్తు సమాచారాన్ని సర్పంచ్లకు చేరవేశామని, ప్రజలు పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు.


