News February 13, 2026
BREAKING: హుస్నాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్దే

మంత్రి పొన్నం ఇలాకా హుస్నాబాద్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 20 వార్డులకు గాను 14 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 2 వార్డులు BRS గెలిచింది. మిగతా వార్డులకు సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Similar News
News February 20, 2026
కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి

కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్లో విధులు నిర్వహించేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న బోయన్న (53) జాతీయ రహదారిపై లారీ కింద పడి దుర్మరణం చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
News February 20, 2026
CM వెలిగొండ పర్యటనపై కీలక సమావేశం

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లు, ప్రాజెక్ట్ పరిసరాల్లో చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. అలాగే ఎల్లుండి సీఎంతో సమావేశం నేపథ్యంలో వివరించాల్సిన అంశాలపై మాట్లాడుకున్నారు.
News February 20, 2026
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: డీఐఈఓ శ్రీధర్ సుమన్

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ ఆఫీసర్ల (డీఓ)తో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 6,003 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు.


