News February 13, 2026
అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పనులు వేగవంతం

అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు 24 గంటలూ పనులు చేస్తున్నారు. సుందరీకరణ పనులకు మరికొంత సమయం పడుతుందని, ప్రస్తుతానికి విగ్రహావిష్కరణ మాత్రమే మార్చి 16న జరుగుతుందని సమాచారం. మిగిలిన పనులు తర్వాత పూర్తి కానున్నాయి.
Similar News
News February 19, 2026
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా సమయంలో పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.
News February 19, 2026
దర్యాప్తు పూర్తయ్యే వరకు రామ్మోహన్ తప్పుకోవాలి: రోహిత్ పవార్

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఆయన మేనల్లుడు, NCP(SP) MLA రోహిత్ పవార్ <<19106331>>మరోసారి<<>> కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కూలిపోయిన ఎయిర్క్రాఫ్ట్ VSR వెంచర్స్కు చెందినది. దీని ఓనర్ రోహిత్ సింగ్కు TDP, కేంద్ర మంత్రి రామ్మోహన్ క్లోజ్. దర్యాప్తు సజావుగా సాగాలంటే ఆయన పదవి నుంచి తప్పుకోవాలి’ అని డిమాండ్ చేశారు. అజిత్ మరణంపై భార్య సునేత్ర CBI దర్యాప్తు కోరడాన్ని ఆయన స్వాగతించారు.
News February 19, 2026
గర్భనిరోధక మాత్రలను ఎప్పుడు తీసుకోవాలి?

అసురక్షిత సంభోగం జరిగిన 72 గంటల్లోపు ఒక మాత్రను తీసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ వైద్యుడి సిఫార్సు మేరకు దీన్ని 5 రోజుల వరకు తీసుకోవచ్చు. అయితే మీరు సంభోగంలో పాల్గొన్న అనంతరం టాబ్లెట్ను ఎంత త్వరగా తీసుకుంటే గర్భం రాకుండా ఉండే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. సంభోగంలో పాల్గొని 72 గంటలు గడిస్తే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.


