News May 1, 2024
శాలిగౌరారం: వడదెబ్బతో యువకుడి మృతి

శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామానికి చెందిన మేతరి అనిల్ కుమార్ (32) వడదెబ్బతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అతడు కొంతకాలంగా గ్రామంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను కొనసాగిస్తున్నాడు. రెండు రోజుల కింద ఎండ తీవ్రతతో పాటు, వంట వేడి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నల్గొండ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు బంధువులు, గ్రామస్థులు పేర్కొన్నారు.
Similar News
News March 14, 2026
పుకార్లు నమ్మొద్దు.. మోసపోవద్దు: నల్గొండ కలెక్టర్

జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని నల్గొండ కలెక్టర్ స్పష్టం చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ దొరకదనే పుకార్లను నమ్మి అధిక ధరలకు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. జిల్లాలోని 33 ఏజెన్సీల ద్వారా బుకింగ్ చేసిన 4 నుంచి 5 రోజుల్లోపు సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఏజెన్సీల వద్ద 8118 సిలిండర్ల నిల్వలు ఉన్నాయని తెలిపారు.
News March 13, 2026
వాడపల్లి కేసులో వివరణ కోరిన మానవ హక్కుల సంఘం

వాడపల్లి పోలీసుల కస్టడీలో గిరిజన యువకుడు సాయి సిద్ధుపై జరిగిన చిత్రహింసల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాధితుడికి రూ.50 వేల నష్టపరిహారం ఎందుకు చెల్లించకూడదో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయాన్ని హైకోర్టు న్యాయవాది రేవంత్ వెల్లడించారు.
News March 13, 2026
గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్పై ఉక్కుపాదం: మంత్రి ఉత్తమ్

ఎల్పీజీ గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 288 కేసులు నమోదు చేశామన్నారు.


