News February 14, 2026

గడువులోగా ‘స్వమిత్వ’ సర్వే పూర్తి చేయాలి: జేసీ

image

జిల్లాలో రెండో విడత ‘స్వమిత్వ’ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 197 గ్రామాలకు గాను ప్రస్తుతం చివరి దశలో ఉన్న 54 గ్రామాల్లో సర్వేను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Similar News

News April 17, 2026

ప.గో: జీతాలు రాక హోంగార్డుల పరేషాన్!

image

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు గత 15 రోజులుగా జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 190 మంది హోంగార్డులకు సుమారు రూ.40 లక్షల వేతనాలు చెల్లించాల్సి ఉంది. అంకితభావంతో పనిచేస్తున్న తమపై అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని, కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి జీతాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News April 17, 2026

గుర్రపుడెక్కతో మహిళలకు ఉపాధి: కలెక్టర్ నాగరాణి

image

కాలువలు, డ్రైన్ల నుంచి గుర్రపుడెక్కను సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల అటు డ్రైన్ల ప్రక్షాళనతో పాటు ఇటు మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, డ్వామా పీడీలు పాల్గొన్నారు.

News April 17, 2026

గుర్రపుడెక్కతో మహిళలకు ఉపాధి: కలెక్టర్ నాగరాణి

image

కాలువలు, డ్రైన్ల నుంచి గుర్రపుడెక్కను సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల అటు డ్రైన్ల ప్రక్షాళనతో పాటు ఇటు మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, డ్వామా పీడీలు పాల్గొన్నారు.