News February 14, 2026
కరీంనగర్లో చతికిలపడ్డ ‘కారు’.. పట్టు కోల్పోయిన ‘పతంగి’

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత పాలకవర్గంలో 33 స్థానాలతో ఆధిపత్యం చలాయించిన బీఆర్ఎస్, ఈసారి కేవలం 9 సీట్లకే పరిమితమై భంగపడింది. హేమాహేమీలు ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. మరోవైపు, ఎంఐఎం సైతం తన పాత స్థానాలను నిలబెట్టుకోలేక కేవలం 3 చోట్ల మాత్రమే గెలిచి చతికిలపడింది.
Similar News
News April 18, 2026
సూర్యాపేట డీఐఈఓగా సులోచన రాణి బాధ్యతలు

సూర్యాపేట డీఐఈఓగా బి. సులోచన రాణి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న భాను నాయక్ ఆమెకు బాధ్యతలు అప్పగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సులోచన రాణి మాట్లాడుతూ.. జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపునకు, కళాశాలల పర్యవేక్షణకు ప్రత్యేక కృషి చేస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 18, 2026
జగిత్యాల: ‘కాంగ్రెస్ విజయాల్లో సేవాదళ్ కీలకం’

జగిత్యాలలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ముకేశ్ కన్నా ఆధ్వర్యంలో జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గాజంగి నందయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విజయాల్లో సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తుందని, క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు.
News April 18, 2026
GNT: వైసీపీలో ‘ఆధిపత్య’ రగడ.. అంబటి VS అప్పిరెడ్డి!

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అంబటి బాధ్యతలు చేపట్టగా, స్థానికంగా అప్పిరెడ్డికి ఉన్న బలమైన అనుచరగణం ఇద్దరి మధ్య చిచ్చుకు కారణమవుతోంది. నియోజకవర్గ రహస్యాలు ప్రత్యర్థి వర్గానికి చేరుతున్నాయనే అనుమానంతో నేతల మధ్య గ్యాప్ పెరగడం, క్యాడర్లో గందరగోళానికి దారితీస్తోంది.


