News February 14, 2026

కుప్పంలో తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు

image

తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2 రోజులుగా కుప్పంలో తనిఖీలు నిర్వహించిన్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి తమిళనాడుకు చెందిన కూలీలను బస్సుల్లో తీసుకెళ్లి శేషాచలం పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టాడని కుప్పం మండలానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని తిరుపతికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డవారు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 17, 2026

612 కేసులు నమోదు: చిత్తూరు SP

image

విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ హెచ్చరించారు. 2025 జనవరి 1 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 612 కేసులు నమోదు చేసి రూ. 69,500 జరిమానా విధించినట్టు ఆయన శుక్రవారం వెల్లడించారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదన్నారు.

News April 17, 2026

కుప్పంలో అక్రమ మైనింగ్… ఇకనైనా అడ్డుకట్ట పడేనా ..!

image

కుప్పం నియోజవర్గంలో అక్రమ మైనింగ్ పరంపర కొనసాగుతునే ఉంది. రాత్రుల్లో అధికారుల కళ్లుగప్పి అటు TNకు, ఇటు KAకు రూ.కోట్లు విలువ చేసే గ్రానైట్‌ను తరలించేస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో అడపాదడపా తనిఖీలు చేస్తున్నారు. గ్రానైట్ అక్రమంగా తరలిపోతుందని, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News April 17, 2026

చిత్తూరు: మండుతున్న ఎండలు

image

జిల్లాలో వేసవితాపంతో ప్రజలు అల్లాడుతున్నారు. గురువారం రొంపిచెర్లలో 40.6, గంగవరంలో 40.4, శాంతిపురంలో 39.7, శ్రీరంగరాజపురం, విజయపురంలో 39.5, బంగారు పాళ్యం, నగరి, తవణంపల్లెలో 38.9, పులిచెర్లలో 38.4, పెద్దపంజాణిలో 38.3, పూతలపట్టు, చిత్తూరు రూరల్, నిండ్ర, చిత్తూరు అర్బన్ లో 38.2, పెనుమూరు, పాలసముద్రం, గుడిపాల, యాదమరిలో 37.9 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.