News February 14, 2026

కామారెడ్డి: మద్యం మత్తులో డ్రైవింగ్.. 13 మందికి జైలు శిక్ష

image

ఒక్క క్షణం అజాగ్రత్త కుటుంబాల్లో శాశ్వత విషాదాన్ని నింపుతుందని కామారెడ్డి SP రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపిన 146 మందికి కోర్టు శిక్షలు విధించిందన్నారు. వారిలో 13 మందికి ఒక రోజు జైలు శిక్ష పడగా, రూ.2 లక్షల జరిమానా విధించినట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News April 18, 2026

విశాఖ: బైక్ ఢీకొని వృద్ధుడి మృతి

image

విశాఖ పోర్ట్ ట్రక్ పార్కింగ్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా బైకు ఢీకొని సింహాద్రి(58) అనే వృద్ధుడు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ పార్కింగ్‌లో ఉన్న డ్రైవర్లు 108కి ఫోన్ చేసి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా నిర్ధారించారు. హార్బర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతనిని అక్కడే పనిచేసే లారీ క్లీరన్‌గా గుర్తించారు. మృత దేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

News April 18, 2026

నేడు హనుమకొండ ఐటీఐలో జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో హనుమకొండలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో 6 కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్ వంటి పలు విభాగాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.

News April 18, 2026

గుంటూరులో క్రికెట్ బెట్టింగ్.. ఆరుగురి అరెస్ట్!

image

గుట్టుచప్పుడు కాకుండా హోటల్లో క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి రోడ్డులోని MSగ్రాండ్‌లో బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఈ మేరకు రూ. 7,400 లిక్విడ్ క్యాష్, రూ. 1,54,000 ఆన్‌లైన్ క్యాష్‌ని పోలీసులు సీజ్ చేశారు.