News February 14, 2026
జగిత్యాల: ‘ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తి’

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సెక్షన్ 163 BNSS అమలులో ఉండటంతో ర్యాలీలు, విజయోత్సవాలు, బాణాసంచా, డీజే వినియోగంపై నిషేధం విధించినట్లు తెలిపారు.
Similar News
News April 19, 2026
తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

AP CM చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. NDA అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఈ నెల 20, 21వ తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లోనే CBN ప్రచారం సాగనుంది. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలు, రోడ్డు షోలలో పాల్గొననున్నారు. TNలో ఏప్రిల్ 23వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
News April 19, 2026
మ్యుటేషన్ కొత్త రూల్స్తో గుంటూరు రైతుల అవస్థలు

ఆటో మ్యుటేషన్ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక అమ్మిన, కొన్న వ్యక్తులిద్దరూ అధికారుల వద్ద బయోమెట్రిక్ వేస్తేనే మ్యుటేషన్ పూర్తవుతుంది. ఒకవేళ అమ్మిన వారు అందుబాటులో లేకున్నా, చనిపోయినా ఏం చేయాలనే దానిపై స్పష్టత లేదు. పారదర్శకత కోసమే ఈ రూల్ తెచ్చినా.. దీనివల్ల గుంటూరు జిల్లా రైతులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News April 19, 2026
కాకినాడ: యానిమేటర్లకు అందని సెల్ ఫోన్లు

జిల్లాలోని డ్వాక్రా యానిమేటర్లకు పంపిణీ చేయాల్సిన సెల్ఫోన్లు ఇంకా వారి చేతికి అందలేదు. నాలుగు రోజుల క్రితమే కలెక్టరేట్లో పంపిణీ ప్రక్రియను కలెక్టర్ ప్రారంభించినప్పటికీ, వెంటనే డి.ఆర్.డి.ఏ అధికారులు వాటిని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు ఎం.ఎస్ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 3,500 మందికి పైగా యానిమేటర్లు తమకు ఫోన్లు ఎప్పుడు అందజేస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.


