News February 14, 2026
కామారెడ్డి: ఎమ్మెల్యేల హవా.. రెండు చోట్లా పీఠాలు సొంతం!

కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పట్టును నిరూపించుకున్నారు. బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మదన్ మోహన్ రావులు పీఠాలను దక్కించుకుని రాజకీయంగా తమ ఆధిక్యాన్ని చాటారు. ప్రజలు తమ అభివృద్ధి పనులకు పట్టం కట్టారని, మున్సిపాలిటీల ప్రగతికి మరింత కృషి చేస్తామని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
Similar News
News April 19, 2026
RR: మహిళలకు ఫ్రీ బ్యూటీషియన్ శిక్షణ

చిల్కూరులోని SBI- RSETI ఆధ్వర్యంలో మహిళలకు ఈ నెల 24 నుంచి ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ మహ్మద్ అలీ తెలిపారు. 18- 45 ఏళ్ల మధ్య వయసు గల యువతులు, మహిళలు అర్హులు. ఆధార్కార్డ్, రేషన్కార్డ్, 10th మెమోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 79819 51167 నంబరును సంప్రదించగలరు.
News April 19, 2026
మచిలీపట్నంలో నేడు బంగారం ధర ఎంతంటే!

అక్షయ తృతీయ కావడంతో జిల్లా కేంద్రంమైన మచిలీపట్నంలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. మచిలీపట్నంలో ఆదివారం గ్రాము బంగారం రూ. 15,078 పలుకుతోంది. 10 గ్రాములు రూ. 1,50,780 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ.280గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.
News April 19, 2026
భద్రాద్రి: యువత భవిష్యత్తుకు.. పంచాయతీ సంచలన నిర్ణయం

నాటు సారాయి తయారీ, విక్రయాలపై ఇల్లందు(M) ధనియాలపాడు GP ఉక్కుపాదం మోపింది. సర్పంచ్ సనప సావిత్రి వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక తీర్మానం చేశారు. ఎవరైనా సారాయి కాస్తూ పట్టుబడితే పోలీసు కేసులు, పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా.. వారికి అందే రేషన్, పెన్షన్ వంటి ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.


