News February 14, 2026
NZB: ఓడిన మాజీ మేయర్ కుటుంబీకులు

మొన్నటి వరకు నిజామాబాద్ మేయర్గా ఉన్న దండు నీతూ కిరణ్(BRS) కుటుంబీకులు ఇద్దరూ ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయారు. దండు నీతూ కిరణ్ భర్త దండు చంద్రశేఖర్ ఈ ఎన్నికల్లో BRS తరఫున 8వ డివిజన్ నుంచి, 21వ డివిజన్ నుంచి ఆయన కూతురు దండు రుషిత పోటీలో నిలబడ్డారు. అయితే ప్రజా తీర్పులో తండ్రీ కూతుర్లు ఇద్దరూ ఓటమి చెందారు.
Similar News
News April 10, 2026
NZB: కార్మికులందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి: కమిషనర్

మున్సిపల్ కార్మికులందరూ వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని, ఏ కార్మికుడు కూడా అనారోగ్యానికి గురి కావద్దని NZB మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. DMHO రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
News April 10, 2026
TU: ముగిసిన రెండు రోజుల జాతీయ సదస్సు

టీయూ చేపట్టిన జాతీయ సదస్సు రెండో రోజు(ముగింపు) సదస్సులో ఓయూ జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ ప్రొ.రోజా రాణి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. క్రిస్పర్ టెక్నాలజీ వంటి ఆధునిక విధానాలు వైద్య, వ్యవసాయ రంగాల్లో జన్యు పరిణామాలు, జన్యు సర్దుబాటు వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. డా.సుమలత పలు అంశాలపై ప్రసంగించారు. కన్వీనర్ డా.ప్రసన్న షీలా, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్మయి పాల్గొన్నారు.
News April 10, 2026
NZB: ఆయుష్ విభాగంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు: DMHO

ఆయుష్ విభాగంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు ఉన్నాయని NZB జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ తెలిపారు. శుక్రవారం కోటగల్లీలో నిర్వహించిన ప్రపంచ హోమియో దినోత్సవంలో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రజలు ఆయూష్ విభాగాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో 425 మందికి ఆరోగ్య పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ గంగా దాస్, డాక్టర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.


